షాకింగ్ : ఎయిర్‌పోర్ట్‌లో 45 పిస్టళ్లతో పట్టుబడ్డ దంపతులు..

-

ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో షాకింగ్‌ ఘటన వెలుగు చూసింది. కస్టమ్స్‌ అధికారులు రోజులాగే తనిఖీలు చేపడుతుండగా.. ఓ భారతీయ దంపతుల వద్ద ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 45 పిస్టళ్లు లభ్యమయ్యాయి. వాటిని చూసిన కస్టమ్స్‌ అధికారులు నివ్వెరపోయారు. దీంతో సదరు దంపతులను కస్టమ్స్‌ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే, వారి నుంచి స్వాధీనం చేసుకున్నవి అవి నిజం తుపాకులా? కాదా? అనే అంశం కూడా పరిశీలించారు కస్టమ్స్‌ అధికారులు. ఈ కేసును విచారిస్తున్న నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్ జీ) మాత్రం ఇవి నిజం తుపాకేలేనని అభిప్రాయం వ్యక్తి చేసింది.

ఈ తుపాకులు పూర్తిగా పనిచేసే స్థితిలో ఉన్నాయని గుర్తించిన ఎస్‌ఎస్‌జీ.. స్వాధీనం చేసుకున్న తుపాకుల విలువ రూ.22.5 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు కస్టమ్స్‌ అధికారులు. అయితే.. జగ్జీత్ సింగ్, జస్వీందర్ కౌర్ దంపతులు వియత్నాంలోని హోచిమిన్ సిటీ నుంచి ఢిల్లీకి వచ్చారు. జగ్జీత్ సింగ్ వద్ద ఉన్న రెండు బ్యాగుల్లో ఈ తుపాకులను గుర్తించారు. వాటిని తన సోదరుడు మంజీత్ సింగ్ ఇచ్చినట్టు జగ్జీత్ విచారణలో వెల్లడించాడు. ఆ పిస్టళ్లను మంజీత్ సింగ్ ఫ్రాన్స్ లోని పారిస్ నుంచి వియత్నాం తెచ్చాడని, అక్కడ తన సోదరుడు జగ్జీత్ కు అప్పగించాడని తేలింది. అనంతరం హోచిమిన్ సిటీ ఎయిర్ పోర్టు నుంచి మాయం అయ్యాడని కస్టమ్ అధికారి వివరించారు. కాగా, ఆ రెండు బ్యాగులకు ఉన్న సెక్యూరిటీ ట్యాగ్ లను తొలగించి, వాటిని రూపుమాపడం ద్వారా జస్వీందర్ కౌర్ భర్తకు సాయపడిందని, అంతేకాదు, తామిద్దరం గతంలో టర్కీ నుంచి భారత్ కు 25 పిస్టళ్లు తెచ్చినట్టు ఆ దంపతులు ఒప్పుకున్నారని విచారణ వెల్లడైందని కస్టమ్స్‌ అధికారులు తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news