షాకింగ్ న్యూస్..జన్ ధన్ యోజన్ ఖాతాను క్లోజ్ చేస్తున్నారా?

-

కేంద్ర ప్రభుత్వం అందరికి బ్యాంక్ అకౌంట్ ఉండాలన్నా ఉద్దేశ్యంతో ఎలాంటి మినిమమ్ డిపాజిట్ లేకుండా జీరో అకౌంట్ ను ఓపెన్ చేసుకోవచ్చని జన్ ధన్ యోజన ఫథకాన్ని కేంద్ర ప్రభుత్వం 15 ఆగస్టు, 2014న ప్రారంభించారు.ఈ పథకం 28, ఆగస్టు 2014లో అమలులోకి వచ్చింది. చాలామంది జన్ ధన్ యోజన పథకం కింద ఖాతాలను తెరిచారు.

కాగా, జన్ ధన్ ఖాతా ఉన్న బ్యాంక్ లో మరో ఖాతా ఉన్నవాళ్లు కూడా చాలామంది ఉన్నారు. ఒకే బ్యాంక్ లో ఒకే ఆధార్ తో రెండు అకౌంట్స్ ఉంటే.. ఆన్ లైన్ లావాదేవీలు చేయలేదు. యోనో, ఎస్బీఐ వంటి వాటిలో లాగిన్ కు అవకాశం ఉండదు. అందుకే ఇటీవల ఈ జన్ ధన్ ఖాతాలను క్లోజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది..ఖాతాను క్లోజ్ చేసుకోవడం వల్ల రూ. 2.30 లక్షల వరకు నష్టపోయే అవకాశం ఉంటుంది. జన్ ధన్ ఖాతా కలిగిన వారికి ఉచితంగానే రూపే డెబిట్ కార్డు అందిస్తారు. ఈ కార్డు పై రూ.2 లక్షల వరకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ లభిస్తుంది.
ఖాతా కలిగిన వారు సడెన్ గా మరణిస్తే భీమాను పొందవచ్చు..ఆధార్ కార్డు లింక్ చేసుకోని వాళ్ళు ఈ ప్రయోజనాలను పొందలేరు. ఇప్పటివరకు జన్ ధన్ ఖాతా ఓపెన్ చేయకపోతే మొదట సమీప బ్యాంక్ కు వెళ్లాలి..జనధన్ ఫారం పూర్తి చేయాలి. అందులో మీ పేరు, మొబైల్ నంబర్, చిరునామా, వ్యాపారం, ఉపాధి, వార్షిక ఆదాయం ఆధారపడిన వారి సంఖ్య, నామిని మొదలైనవి పూర్తీ చెయ్యాలి.

ఆధార్ కార్డు, పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ లాంటివి జిరాక్స్ సమర్పించాలి. అకౌంట్ ఓపెన్ కు ఎలాంటి రుసుము వసూలు చేయరు. ఒక వేళ ఖాతాదారుడు ప్రమాదానికి గురయితే క్లయిమ్ కోసం క్లెయిమ్ ఫామ్, డెత్ సర్టిఫికెట్, ప్రమాదం జరిగినట్టు ఎఫ్ఐఆర్, పోస్ట్ మార్టం రిపోర్ట్, ఆధార్ కార్డ్ వివరాలు సబ్మిట్ చేయాలి..కొద్ది రోజులకు క్లైమ్ అవుతుంది.ఈ ఖాతా ఉన్న వాళ్ళు కూడా ఆధార్ లింక్ చేయాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news