నేటి నుంచి ఐదో విడుత గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌

-

పర్యావరణ హితం, దేశ వ్యాప్తంగా పచ్చదనం కోరుకుంటూ మొదలైన గ్రీన్ ఇండియా చాలెంజ్ ఐదో సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. వానాకాలం సీజన్ తోనే మొక్కలు నాటే ఉద్యమం మొదలు కాబోతోంది. నేటి నుంచి ఐదో విడుత గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కార్యక్రమం ప్రారంభంకానుంది. శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ రోడ్ గొల్లూరు అటవీపార్క్‌లో ఎంపీ సంతోష్‌ కుమార్‌తో కలిసి ఈశా ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్‌ ప్రారంభించనున్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి పాల్గొని మొక్కలు నాటుతారు. సీఎం కేసీఆర్‌ మానస పుత్రిక తెలంగాణకు హరితహారం స్ఫూర్తితో 2018లో ఎంపీ సంతోష్‌ కుమార్‌ గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ను ప్రారంభించారు. ఒక్కరు మూడు మొక్కలు నాటి, మరో ముగ్గురు మొక్కలు నాటాల్సిందిగా చాలెంజ్‌ విసరటమే గ్రీన్‌ ఇండియా స్ఫూర్తి. ప్రారంభించిన అనతికాలంలోనే దేశవ్యాప్తంగా ఉద్యమరూపం దాల్చింది. అనేక రంగా ప్రముఖులను ఒక్కతాటిపైకి చేర్చి హరిత స్ఫూర్తిని నిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version