BREAKING : ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. 6 గురు కరోనా రోగులు సజీవ దహనం

-

మహారాష్ట్ర రాష్ట్రంలో దారుణం సంఘటన చోటు చేసుకుంది. ఆ రాష్ట్రంలోని అహ్మద్‌ నగర్‌ ఆస్పత్రి లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఆస్పత్రిలోని ఐసీయూలో ఒక్క సారిగి మంటలు చెలరేగాయి. దీంతో ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆరుగురు కరోనా రోగులు సజీవ దహనం అయ్యారు.

మరో 10 మంది కరోనా బాధితుల పరిస్థితి విషయంగా ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇక ఆస్పత్రి లో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలియగానే.. ఆస్పత్రి సిబ్బంది అప్రమత్తం అయ్యారు. దీంతో అగ్ని ప్రమాదక సిబ్బంది ఫోన్‌ చేశారు. సమాచారం అందగానే… ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్‌ ఇంజన్లు… మంటలు ఆర్పే ప్రయత్నాలు చేస్తున్నాయి.

ప్రస్తుతం ఆ ఆస్పత్రిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్‌ ఉన్నట్లు సమాచారం అందుతోంది.  షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు సిబ్బంది చెబుతున్నారు. ఈ ఘటన గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news