విహారయాత్రలో విషాదం.. ఒకే కుటుంబంలో 8 మంది మృతి

-

విహారయాత్ర ఓ ఇంట విషాదం నింపింది. ఫ్యామిలీతో కలిసి సరదాగా ట్రిప్‌కు వెళ్లిన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నదిలో బోటు ప్రయాణానికి వెళ్లిన ఆ కుటుంబం తిరిగి రాని లోకానికి వెళ్లిపోయింది. పడవ బోల్తా పడటంతో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జార్ఖండ్‌లోని కోడెర్మా జిల్లాలోని పంచఖేరో డ్యామ్ వద్ద సంభవించింది. పంచఖేరో డ్యామ్ వద్ద విహారయాత్రకు వచ్చిన కుటుంబం పడవ ప్రయాణం చేయాలనుకున్నారు. దీంతో ఓ కంట్రీ బోటును ఏర్పాటు చేసుకుని నదిలోకి ప్రవేశించారు.

boat-death
boat-death

అయితే ఉన్నట్టుండి.. నదిలో భారీ అలలు తలెత్తాయి. దీంతో పడవలో ఉన్న కుటుంబం బ్యాలెన్స్ తప్పడంతో పడవ బోల్తా పడింది. దురదృష్టవశాత్తు పడవలో ఉన్న వ్యక్తులకు ఈత రాకపోవడంతో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఆ కుటుంబంలో ప్రదీప్ కుమార్, బోటు నడిపే వ్యక్తికి మాత్రమే ఈత రావడంతో అతి కష్టం మీద వీరిద్దరు ఒడ్డుకు చేరుకున్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. మృతదేహాలను ఒడ్డుకు చేర్చింది. మృతులు సీతారాం యాదవ్ (40 ఏళ్లు), శివం సింగ్(17 ఏళ్లు), సెజల్ కుమారి(16 ఏళ్లు), రాహుల్ కుమార్ (16 ఏళ్లు), అమిత్ కుమార్ (16 ఏళ్లు), పాలక్ కుమార్(14 ఏళ్లు), భవ్వా (5 ఏళ్లు)గా పోలీసులు నిర్ధారించారు.

Read more RELATED
Recommended to you

Latest news