జారితే.. జమ్మలమడుగు జాతరే.. రైలుపై తిక్కవేశాలు..

-

కొందరు తమ వీడియోలకు ఎక్కువగా వీక్షణలు రావాలని కొత్త కొత్త ప్రయోగాలు చేస్తుంటారు. అయితే అవి కొన్ని సార్లు బెడిసి కొడుతుంటాయి. కొన్ని ప్రమాదాలకు దారి తీస్తుంటాయి కూడా. అయితే.. అమెరికాలోని బ్రూక్లిన్‌లో ఈ సంఘటన జరిగింది. ఒక లోకల్ రైలు విలియమ్స్‌బర్గ్ వంతెనపై వెళ్తున్నది. కాగా, 8 మంది వ్యక్తులు ఆ రైలు బోగీలపైన ఉన్నారు. ముగ్గురు దానిపై పరుగెత్తగా, మరో వ్యక్తి స్కిపింగ్‌ చేశాడు. మరి కొందరు రైలు బోగి టాప్‌పై ప్రమాదకరంగా, నిర్లక్ష్యంగా నిల్చొని ఉండగా, ఒకరిద్దరు కూర్చొని ఉన్నారు.

కాగా, ఆ రైలు విలియమ్స్‌బర్గ్ వంతెనపై వెళ్తున్నప్పుడు సమీపంలోని ఎత్తైన బిల్డింగ్‌ నుంచి ఒకరు ఈ వీడియో తీశారు. మరోవైపు ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. లక్షలాది మంది దీనిని చూశారు. ఆ వ్యక్తుల ప్రమాదకర స్టంట్లను కొందరు విమర్శించారు. 1980లో రైలు పైన ప్రయాణించడం అమెరికాలో కామన్‌ అని ఒకరు గుర్తు చేశారు. పెట్రోల్‌ రేట్లు పెరుగుతుండటంతో ఇలాంటి సాహసాలు ఇంకా ఎన్ని చూడాలో అన్ని ఒకరు చమత్కరించారు. కాగా, ఈ వీడియో తమ దృష్టికి వచ్చినట్లు న్యూయార్క్ పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version