ఈటలకు షాక్.. ఆ అనుచరులిద్దరూ టీఆర్ఎస్ లోకి..

-

ఆత్మగౌరవ నినాదంతో టీఆర్ఎస్ పార్టీ నుండి బయటకి వచ్చి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటల రాజేందర్, బీజేపీలో చేరారు. హుజురాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో పాదయాత్ర ప్రారంభించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై కేసీఆర్ నాయకత్వంపై విమర్శలు గుప్పిస్తూ ఎన్నికల్లోకి వెళ్తున్నారు. ఐతే బీజేపీలో ఉన్న ఈటలకు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. తాజాగా మోత్కుపల్లి, పెద్దిరెడ్డి బీజేపీకి గుడ్ బై చెప్పారు.

ప్రస్తుతం ఆయన ప్రధాన అనుచరుల్లో ఒకరు బీజేపీని వీడనున్నట్లు తెలుస్తుంది. దేశినికోటి, ఆయన సతీమణి జమ్మికుంట మున్సిపల్ కార్పోరేషన్ వైస్ ఛైర్మన్ దేశిని స్వప్న టీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నట్లు సమాచారం. దీంతో ఈటలకు పెద్ద షాక్ తగిలినట్లయింది. ఇప్పటికే ప్రధాన నాయకులు పార్టీని వీడుతుండడం ప్రజల్లో ఒకరకమైన భావనను కలగజేస్తుంటే, అనుచరులు కూడా బయటకి వెళ్ళడం అనేక చర్చలకు తావిస్తుంది. మరి ఇలాంటి సమయంలో హుజురాబాద్ నియోజకవర్గాన్ని చేజిక్కించుకోవడానికి ఈటల ఎలాంటి వ్యూహాన్ని రచిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news