ఏపీలో దారుణం..రక్త పరీక్షలకోసం వచ్చిన మహిళతో శృంగారం !

-

ఏపీలో మరో దారుణం చోటు చేసుకుంది. రక్తపరీక్షల కోసం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వచ్చిన మహిళపై ఆసుపత్రి ఉద్యోగి మంగళవారం రాత్రి లైంగిక దాడికి యత్నించినట్లు సమాచారం. విజయనగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చిన మహిళకు ఈసీజీ చేయించుకోవాలని వైద్యులు సూచించడంతో ఆమె ఈసీజీ గదిలోకి వెళ్ళగా, అక్కడి ఉద్యోగి లైంగిక దాడికి యత్నించినట్లు తెలిసింది.

బాలిక-అత్యాచారం
బాలిక-అత్యాచారం

దీంతో ఆమె బయటకు పరిగెత్తుకొని వచ్చి బంధువులకు విషయం తెలపడంతో వారు డయల్ 100 కు ఫోన్ చేశారు. లైంగిక దాడి యత్నానికి గురైన బాధితురాలి బంధువులు ఆస్పత్రి ఉద్యోగిని చితకబాదినట్టు తెలిసింది. సమాచారం అందుకున్న వెంటనే వన్ టౌన్ పోలీసులు ఆసుపత్రికి చేరుకొని విచారణ చేపట్టగా ఆ సదరు బాధితురాలు ఇక్కడ ఎటువంటి సంఘటన జరగలేదని లిఖితపూర్వకంగా రాసి ఇవ్వడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news