హైకోర్ట్ చెప్పినా సరే జైలులోనే రఘురామ, ఏం జరుగుతుంది…?

-

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు అరెస్ట్ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది. అయితే నిన్న సాయంత్రం రఘురామను జైలు నుంచి రమేష్ ఆస్పత్రికి తరలించాలని హైకోర్ట్ ఆదేశాలు ఇచ్చినా సరే పోలీసులు మాత్రం ఇప్పటి వరకు తరలించలేదు. రాత్రంతా జిల్లా జైలు లోనే ఎంపీ రఘురాం కృష్ణ రాజు ఉన్నారు. ఎంపీ ని తక్షణమే రమేష్ ఆసుపత్రి కి తరలించాలని హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలు ఇచ్చింది.

గత రాత్రి 10 గంటలకు హైకోర్టు ఉత్తర్వులు జారీ అయ్యాయి. హైకోర్టు ఉత్తర్వులతో జైలు వద్దకు న్యాయవాదులు వెళ్ళగా అధికారులు స్పందించలేదు. కొద్ది సేపట్లో జైలు అధికారులకు హైకోర్టు ఉత్తర్వులను నాయవాదులు ఇచ్చే అవకాశం ఉంది. ఈ రోజు ఎంపీ రఘురాం కృష్ణ రాజు ను రమేష్ ఆసుపత్రి కి తరలించే అవకాశం ఉందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news