సెప్టెంబర్ 17న పివి రోడ్ నుంచి భారీ ర్యాలీ – తలసాని

-

సెప్టెంబర్ 17 తెలంగాణ జాతీయ సమైక్యత దినం సందర్భంగా ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటులను మంత్రులు తలసాని, శ్రీనివాస్ గౌడ్,సత్యవతి రాథోడ్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఇతర అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని..మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17 న పీవీ రోడ్ నుంచి భారీ ర్యాలీ ఉంటుందని ప్రకటించారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి… అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పిస్తారన్నారు.

1948 హైదరాబాద్ విలీనం తరువాత 75 సంవత్సరాల సందర్భంగా కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ…పచ్చబడ్డ ప్రాంతన్ని రక్తపాతం పరేలా చేయాలని చూస్తున్నారు..తెలంగాణ లో అన్ని వర్గాల వారు బాగుపడ్డారని తెలిపారు. మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ ఈ సభ లో లక్షలాది గిరిజనులు హాజరవుతారు..తెలంగాణ ఉద్యమం లో గిరిజనులది ఏనాలేనిదని చెప్పారు. గిరిజనుల భవన్ ప్రారంభం తరువాత గిరిజనులు ర్యాలీ గా ఎన్టీఆర్ స్టేడియం కి వస్తారు..గిరిజనుల రిజర్వేషన్ల కోసం కేబినెట్ లో తీర్మానం చేశామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news