BREAKING : ఏపీలో కొత్త రాజకీయ పార్టీ..

-

BREAKING : ఏపీలో కొత్త రాజకీయ పార్టీ అవతరించబోతోంది. ఈ మేరకు పారిశ్రామిక వేత్త రామచంద్ర యాదవ్ కీలక ప్రకటన చేశారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో మెజారిటీ ప్రజల కోరిక మేరకు కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం అవుతుందని ప్రకటించారు పారిశ్రామిక వేత్త రామచంద్ర యాదవ్. ఇప్పటి వరకు జరిగిన దోపిడీని కొత్త పార్టీ కక్కిస్తుందని.. వైసిపి, టిడిపి నుంచి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి విముక్తి కావాలన్నారు.

ఆవిర్భావ సభ జూలై 23న నాగార్జున వర్సిటీలో ప్రజా సింహ గర్జన పేరుతో నిర్వహిస్తామని…బీసీ, ఎస్ సి, ఎస్టీ వర్గాలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని ఫైర్ అయ్యారు. టిడిపి పాలనలో కొన్ని కుటుంబాలు మాత్రమే అభివృద్ధి చెందాయని… ఏ వర్గ అభ్యున్నతి కోసం ఆ పార్టీ పాటుపడలేదని విమర్శలు చేశారు. రౌడీ, హత్యా రాజకీయాలు ఫ్యాక్షన్ పార్టీ వైసిపి అని.. ఆ పార్టీ ఏర్పాటు, అది అధికారంలోకి రావడం దురదృష్టం అని మండిపడ్డారు పారిశ్రామిక వేత్త రామచంద్ర యాదవ్. రెండు పార్టీలు రాజధాని విషయంలో అన్యాయం చేశాయని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Latest news