తన భార్య సైరా బానును టీజ్ చేసిన రెహ్మాన్

-

ఇటీవల చెన్నైలో విగటన్‌ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఇందులో ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డును అందుకున్న ఏ.ఆర్ రెహ్మాన్‌ ఇదే కార్యక్రమానికి హాజరైన తన భార్య సైరా బానును వేదికపైకి రావాలని ఆహ్వానించారు. ఆ తర్వాత రెహ్మాన్‌ మాట్లాడుతూ.. సాధారణంగా నా ఇంటర్వ్యూలను తిరిగి చూడను. కానీ ఈమె మాత్రం పదేపదే చూస్తుంటారు’ అన్నారు. సైరా బాను మైక్‌ అందుకుని మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఆ వెంటనే రెహ్మాన్‌ జోక్యం చేసుకుని.. ‘హిందీలో వద్దు తమిళంలో మాట్లాడు ప్లీజ్‌’ అంటూ కోరారు.

హిందీ, తమిళ్ లో కాకుండా మధ్యేమార్గంగా ఇంగ్లీషులో మాట్లాడారు. ‘‘క్షమించాలి.. నాకు తమిళం స్పష్టంగా రాదు. అందుకే ఇంగ్లీషులో మాట్లాడుతాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను. రెహ్మాన్‌ వాయిస్‌ అంటే ఎంతో ఇష్టం నాకు. ఆ వాయిస్ తో నేను ప్రేమలో పడిపోయాను. ఇంతకన్నా ఏం చెప్పగలను’’ అని అన్నారు. ‘రోజా’ సినిమాతో సంగీత దర్శకుడిగా కెరియర్ ప్రారంభించిన ఏఆర్ రెహ్మాన్.. ఎన్నో చిత్రాలకు అద్భుత గీతాలను అందించారు. స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాలోని ‘జైహో’ పాటకు ఆస్కార్ అవార్డు అందుకున్నారు. 1995లో సైరా బానును పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఖతిజ, రహీమా, అమీన్ ఉన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news