నెల్లూరులో మాజీ మంత్రి కాకాని ఒక మూడో కేజీఎఫ్ : మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

-

అమరావతికి పెట్టుబడులు వస్తున్నాయని అక్కసుతో వైసీపీ వ్యవహరిస్తోందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాజధాని మునిగిపోతోందని వైసీపీ దుష్ప్రచారం చేస్తుంది. అమరావతికి ఎటువంటి పెట్టుబడులు రాకుండా చేయడమే లక్ష్యంగా వైసీపీ వ్యవహారిస్తోందన్నారు. వాస్తవానికి అమరావతి సముద్ర నీటి మట్టం కంటే 35 మీటర్ల ఎత్తులో ఉంది. భారీ వర్షాలు వస్తే హైదరాబాద్, చెన్నై పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం అవుతుంది.

అమరావతిలో యధావిధిగా కార్యకలాపాలు జరుగుతుంటే వైసీపీ వాళ్ళు ఏడుస్తున్నారు. అమరావతి గురించి నోరెత్తే అర్హత వైసీపీకి కానీ, జగన్ కి కానీ లేదన్నారు. నెల్లూరులో మాజీ మంత్రి కాకాని ఒక మూడో కేజీఎఫ్ అని.. కాకాని చంద్రబాబు గురించి మాట్లాడితే సహించమన్నారు. కాకాని నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. కాకాని అవినీతిపై త్వరలో చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. వైసీపీలో కేవలం జగన్, భారతి మాత్రమే మిగులుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news