ఇంటికి వచ్చిన వ్యక్తితో అంటీ ఎఫైర్‌.. చివరికి

-

బీహార్ గోపాల్‌గంజ్ జిల్లా లాధ్‌పూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన మహ్మద్ మియాన్ అనే వ్యక్తికి నూర్జహాన్ ఖాతూన్, ఆరుగురు పిల్లలు ఉన్నారు. మహ్మద్ చేపల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు. భర్త, పిల్లలతో సంతోషంగా ఉన్న నూర్జహాన్ జీవితంలోకి ఓ వ్యక్తి ప్రవేశించాడు. దీంతో అప్పటిదాకా సవ్యంగా సాగుతున్న వారి సంసారం సమస్యలకు నిలయంగా మారింది. సమీప ప్రాంతానికి చెందిన నౌషద్ అనే వ్యక్తిపై నూర్జహాన్ ప్రేమ పెంచుకుంది. భర్తకు తెలీకుండా అతడితో తరచూ కలుస్తూ ఉండేది.

వీరి ఎఫైర్ గురించి భర్తకు తెలియడంతో, అతను ఇలాంటి పనులు చేయవద్దని భార్యను మందలించాడు. ఈ విషయంలో వారిద్దరూ తరచూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. మారమని భార్యకు నచ్చచెబుతూ ఉండేవాడు. ఎంత చెప్పినా వినకపోయే సరికి, భార్యను తరచూ కొట్టడం మొదలుపెట్టాడు. రోజు రోజుకూ చిత్రహింసలు పెరిగిపోవడంతో నూర్జహాన్ చివరకు.. పిల్లలను తీసుకుని ప్రియుడితో వెళ్లేందుకు నిర్ణయించుకుంది. ఈ విషయం తెలిసి ఇటీవల భార్యను మరింత చిత్రహింసలకు గురి చేసేవాడు. దీంతో చివరకు ఆమె భర్తను చంపేయాలనుకుంది. ఇదే విషయాన్ని ప్రియుడికి చెప్పింది. ఇద్దరూ కలిసి కిరాయి గుండాలను మాట్లాడారు. వారికి రూ.50వేలు సుపారీ ఇచ్చారు. మహ్మద్ రాత్రిపూట నిద్రపోతున్న సమయంలో అతనిపై కిరాయి గుండా కాల్పులు జరిపాడు. దీంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితులను అరెస్ట్ చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version