ఇంగ్లాడ్ సెంట్రల్ బ్యాంకులో భారత సంతతి మహిళకు కీలక పదవి

-

ఇంగ్లాడ్ సెంట్రల్ బ్యాంక్‌లో వడ్డీ రేట్లను నిర్ణయించే కీలక ద్రవ్య పరపతి విధాన కమిటీలో ఎక్స్ టర్నర్ సభ్యురాలిగా భారత సంతతికి చెందిన మహిళ నియమితులయ్యారు. ప్రముఖ విద్యావేత్త, భారత సంతతి మహిళ డాక్టర్ స్వాతి ధింగ్రా ఈ కీలక బాధ్యతల్లో నియమితులు కావడం ఇదే మొదటిసారి. ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ అప్లైడ్ మెక్రోఎకనామిక్స్ లో స్పెషలైజేషన్ పూర్తి చేసుకున్న ధింగ్రా.. ప్రస్తుతం లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అసోసియేట్ ప్రొఫెసర్‌గా కొనసాగుతున్నారు.

WOMAN
WOMAN

కాగా, స్వాతి ధింగ్రా ఢిల్లీ యూనివర్సిటీలో విద్యను అభ్యసించారు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో మాస్టర్స్ పట్టాను పొందారు. అలాగే యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్-మాడిసన్ నుంచి ఎంఎస్, పీహెచ్‌డీ పట్టా పొందారు. బ్రిటన్ ట్రేడ్ మోడలింగ్ రివ్యూ ఎక్స్ పర్ట్ ప్యానెల్‌లో సభ్యురాలిగా కొనసాగి.. ఆగస్టు 9వ తేదీన ఎంపీసీలో చేరారు. ఎంపీసీ సభ్యుడిగా పని చేస్తున్న మైఖల్ సాండ్రూస్ స్థానంలో ధింగ్రా పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాడ్ ఎంపీసీలో గవర్నర్‌తోపాటు ముగ్గురు డిప్యూటీ గవర్నర్లు ఉంటారు. వీరిని బ్రిటన్ ఆర్థిక మంత్రి నియమిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news