ఏపీ ప్రజలకు శుభవార్త..గ్రామాల్లోనే ఉచితంగా ఆధార్ అప్డేట్ !

-

ఏపీ ప్రజలకు జగన్‌ సర్కార్‌ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఏపీలో ఆధార్ కార్డుదారులు తమ బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. మరో విడత ఈ నెల 30 వరకు గ్రామ వార్డు సచివాలయాల్లో ఆధార్ ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేసింది. ఈనెల 27 నుంచి నాలుగు రోజులు పాటు ఆధార సేవలు అందుబాటులో ఉంటాయి.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామా సచివాలయాల్లోనూ ఈ క్యాంపులో నిర్వహించాలని గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 20వేల మందికి పైగా గ్రామ, వార్డు సచివాలయాల్లో, తమ ఆధార్ కార్డులో తమ బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేసుకున్నారు. ఇప్పటివరకు ఆధార్ వివరాలు అసలు నమోదు చేసుకొని స్కూల్స్ విద్యార్థులు ఈ క్యాంపులో తమ వివరాలు పూర్తి ఉచితంగా నమోదు చేసుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. ఇంకా ఎవరైనా ఉంటే తమ వివరాలను అప్డేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version