అచ్చెన్నాయుడు మనిషైతే పెరిగాడు గానీ..బుర్ర మాత్రం పెరగలేదు: మంత్రి బొత్స

-

టెక్కలి నియోజకవర్గం లో అచ్చెన్నాయుడు ని వ్యక్తిగతంగా ఓడించాలి అనేదే వైకాపా ఎజెండా అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అదే జగన్మోహన్ రెడ్డి ఆలోచన అని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఇన్చార్జి మంత్రి హోదాలో టెక్కలి లో ఆదివారం జరిగిన పార్టీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు బొత్స. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అచ్చెన్నాయుడు మనిషైతే పెరిగాడు గాని.. బుర్ర మాత్రం పెరగలేదని మంత్రి బొత్స ఎద్దేవా చేశారు.

మనిషిని చూడగానే తెలిసిపోతుందని అన్నారు. ఈ నియోజకవర్గంలో వైకాపా ఎమ్మెల్యేను గెలిపించాలని.. అదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇందులో రాజీ లేదని వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో అంతా కలిపితే ఎనిమిది నుంచి తొమ్మిది వేల ఓట్ల తేడాతో మాత్రమే అచ్చెన్నాయుడు గెలుపొందారని.. కేవలం ఐదారు వేల ఓట్లు అటు ఇటు మారితే సరిపోతుందని ఈరోజుల్లో అదేం పెద్ద వింత కాదన్నారు. దానికి పెద్దగా కష్టపడక్కర్లేదు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news