స్పీకర్ పై చర్యలు తీసుకోవాలి – బండి సంజయ్

-

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పై రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. పార్టీలో కొత్తగా నియమితులైన పార్లమెంట్ కన్వీనర్లు, జాయింట్ కన్వీనర్లు, జిల్లా ఇన్చార్జిలతో నేడు బండి సంజయ్ బేటి అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. స్పీకర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ రాజకీయ విమర్శలు చేస్తారా? అని ప్రశ్నించారు.

స్పీకర్ తీరుపై శాసనసభలో చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై బీజేపీ సభ్యులు నిలదీస్తారని భయంతోనే కేసీఆర్ వనికిపోతున్నారని అన్నారు. అందుకే సభను రెండు రోజుల పాటే నిర్వహించి తూతూ మంత్రంగా ముగించాలని చూస్తున్నారని బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ప్రజా సమస్యలపై చర్చించకుండా కేసీఆర్ కుట్ర చేస్తున్నారని బండి సంజయ్ అన్నారు. హిందూ పండుగలకు ప్రాధాన్యత లేకుండా కేసీఆర్ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news