ఏపీకి మరోసారి జగనే..ముఖ్యమంత్రి – నటుడు అలీ

-

ఏపీకి మళ్లీ జగనే..ముఖ్యమంత్రి అని జోష్యం చెప్పారు నటుడు అలీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా ప్రముఖ సినీ నటులు మహమ్మద్ అలీ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సినీ నటులు మహమ్మద్ అలీ..ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రభుత్వ సలహాదారుగా పదవి బాధ్యతలు స్వీకరించడం సంతోషంగా ఉందని ఆలీ అన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు అప్పగించిన బాధ్యతలను సమర్ధంగా నిర్వర్తిస్తానని ధీమా వ్యక్తం చేశారు. సలహాదారుగా విలువైన సలహాలు, సూచనలు అందించి ప్రభుత్వానికి మీడియాకు తన వంతు సహకారం అందిస్తూ, మీడియా వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తానని ఆలీ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news