Breaking: బీజేపీలోకి ఆదం విజయ్ కుమార్

-

బీజేపీలోకి చేరికల పర్వకం కొనసాగుతోంది. ఇవాళ ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో కేంద్రమంత్రి సమక్షంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎం నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి బీజేపీలో చేరారు. అయితే.. తాజాగా.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు నాయకులు బీజేపీ లో చేరారు. జూబ్లీహిల్స్‌కు చెందిన మహిళా పారిశ్రామికవేత్త జూటుర్ కీర్తిరెడ్డి కాషాయ కండువా కప్పుకున్నారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆశీర్వాదం తీసుకుని ర్యాలీగా ఆమె పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆపై కిషన్ రెడ్డి, పలువురు నేతల ఆధ్వర్యంలో పార్టీలో చేరారు.

BJP : కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు నేతలు కాషాయతీర్థం

ఆమెతో పాటు మాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీ సుభాషిన్ రెడ్డి తనయుడు ఇంద్రసేనారెడ్డి సైతం కాషాయతీర్థం పుచ్చుకున్నారు. అంతేకాకుండా ఉద్యమకారుడు, టీజేఎస్ నేత గంగపురం వెంకట్ రెడ్డి సైతం బీజేపీలో చేరారు. సికింద్రాబాద్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అదం విజయ్ కుమార్ సైతం పార్టీలో చేరారు. ఎన్నికల ఏడాది కావడంతో పార్టీలు చేరికలపై దృష్టి సారించాయి. గతంలో మునుగోడు ఉప ఎన్నిక సమయంలో మందగించిన చేరికల పర్వం తాజాగా మరోసారి ఊపందుకుంటోంది. కలిసి వచ్చే నేతల కోసం ప్రధాన పార్టీలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news