పవన్ కళ్యాణ్ పొలిటికల్ బ్రోకర్… : కాపు కార్పొరేషన్ చైర్మన్

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కాపు కార్పొరేషన్ చైత్మన్ అడపా శేషు తనదైన శైలిలో ఘాటు వ్యాఖ్యలు చేశాడు. పవన్ కళ్యాణ్ ఈస్ట్ గోదావరిలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే, ఈ పర్యటనలలో భాగంగా వైసీపీ పై తీవ్రంగా విరుచుకుపడుతున్న నేపథ్యంలో వైసీపీ నాయకులు మాటల దాడి చేస్తున్నారు. అందులో భాగంగా అడపా శేషు మాట్లాడుతూ కాపుల కోసం ఎన్నో త్యాగాలు చేసిన వ్యక్తి ముద్రగడ పద్మనాభం… కాపులకు నువ్వు నీ ఫామిలీ ఏమి చేశారో చెప్పాలని కామెంట్ చేశారు. గత ఎన్నికల్లో కాపులు నిన్ను ఓడించారని కక్ష గట్టి.. చంద్రబాబు తో చేతులు కలిపి కుల రాజకీయాలు చేస్తున్నావు అంటూ శేషు మండిపడ్డారు. కాపులకు ఆపన్నహస్తంగా ఉన్న ముద్రగడ పద్మనాభం వైపు ఎప్పుడూ ప్రజలు ఉంటారని ఈ సందర్భంగా శేషు తెగేసి చెప్పాడు.

పవన్ నిన్న మొన్నటి వరకు పొలిటికల్ బ్రోకర్ గా ఉండేవాడని… కానీ ఇప్పుడు పొలిటికల్ జోకర్ గా మారాడని రెచ్చిపోయి మాట్లాడారు.

Read more RELATED
Recommended to you

Latest news