ప్రభాస్‌ని కలిస్తే జాగ్రత్తగా ఉండాలన్న అఖిల్.. అవును అంటూ వంతపాడిన శర్వానంద్

-

ఎవరైనా ప్రభాస్​ని కలిస్తే జాగ్రత్తగా ఉండాలని అఖిల్‌ అక్కినేని అన్నారు. ‘అవును… అంటూ శర్వానంద్‌ ఆయనకు వంతపాడారు. ఈ ఇద్దరు ఎందుకు కలిశారు? ప్రభాస్‌ గురించి ఎప్పుడు మాట్లాడారు? అనే సందేహంలో ఉన్నారా? శర్వానంద్‌ హీరోగా తెరకెక్కిన ఒకే ఒక జీవితం చిత్రం ఈ నెల 9న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రచారాన్ని వేగవంతం చేస్తోంది.

ఈ క్రమంలో అమ్మ చేతి వంట అనే చిట్‌చాట్‌ని ప్లాన్‌ చేసింది. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన అమల అక్కినేనితోపాటు శర్వానంద్‌, అఖిల్‌ అమ్మ చేతి వంటలో పాల్గొని, రుచి చూశారు. తాను వంట చేస్తున్న సమయంలో ”ప్రభాస్‌ ఫూడీ (ఆహారాన్ని అమితంగా ఇష్టపడే వ్యక్తి) అని విన్నా..” అని అమల చెప్పగా.. తనను కలిస్తే జాగ్రత్తగా ఉండాలని అఖిల్‌ నవ్వుతూ సమాధానం ఇస్తారు. ”ఇక చాలు తినలేను అని చెప్పినా ప్రభాస్‌ వదిలిపెట్టరు” అనే ఉద్దేశంలో అఖిల్‌ మాట్లాడారు.

ప్రభాస్‌ అతిథ్యం స్వీకరించటం కష్టమని ఎందరో తారలు చెప్పిన సందర్భాలెన్నో ఉన్నాయి. ప్రస్తుతం అమ్మ చేతి వంట ప్రోమో నెట్టింట సందడి చేస్తోంది. ఫుల్‌ వీడియో సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు విడుదలకానుంది. టైమ్‌ ట్రావెల్‌ నేపథ్యంలో నూతన దర్శకుడు శ్రీ కార్తీక్‌ తెరకెక్కించిన చిత్రమిది. రీతూ వర్మ కథానాయిక. ఈ సినిమాలో శర్వానంద్‌ తల్లిగా అమల నటించారు. ఈ కథ తన హృదయాన్ని హత్తుకుందని వివరిస్తూ.. శర్వానంద్‌ తనకు మూడో అబ్బాయిగా మారాడని అమల ఇటీవల తన మనసులోని మాట పంచుకున్నారు.

ఇక ఈ సినిమా సైన్స్‌ ఫిక్షన్‌ ఆధారంగా తెరకెక్కింది. ‘ఒకే ఒక జీవితం’ టైం ట్రావెల్‌ నేపథ్యంతో, భావోద్వేగ కుటుంబ కథతో ఈ చిత్రం ఉంటుందని ట్రైలర్‌ని బట్టి అర్థమవుతోంది. యువ దర్శకుడు శ్రీ కార్తీక్‌ ఈ చిత్రానికి దర్శకుడు. డ్రీమ్‌ వారియర్స్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌ఆర్‌ ప్రభు, ఎస్‌ ఆర్‌ ప్రకాష్‌ బాబు నిర్మిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news