రైతులకు అలెర్ట్.. రైతు భీమాపథకం లో మార్పులకు నేడే లాస్ట్..

-

తెలంగాణ రైతులకు అలెర్ట్.. రైతుల లబ్ది కోసం అందిస్తున్న పథకాల లో ఒకటి రైతు భీమా.. రైతుబంధు సమూహిక జీవిత బీమా అప్లికేషన్లలో మార్పుల కోసం సర్కార్ అవకాశం కల్పించింది. ఈ ఆర్థిక సంవత్సరం రైతుబీమా పథకం అమలులో భాగంగా ప్రభుత్వం రైతుల పేరిట భారతీయ బీమా సంస్థకు ప్రిమీయం చెల్లింపులు చేస్తుంది.

ఈ క్రమంలో అర్హులైన అన్నదాతలకు అన్యాయం జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం మరో చాన్స్ ఇచ్చింది. గతంలో రైతుబీమాలో నమోదు చేసుకున్న రైతులు తమ వివరాలు ఏమైనా తప్పుగా ఉన్నట్లైతే సరిచేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. నామిని చనిపోతే ఆ స్థానంలో పేరు మార్పు, రైతుతో నామిని సంబంధం ఏదైనా తప్పుగా పడి ఉంటే కూడా మార్చుకోవచ్చు.బీమాలో మార్పులు, చేర్పుల కోసం సంబంధిత క్లష్టర్ల వారీగా మండల వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించి వివరాలు ఇవ్వాలని వ్యవసాయ శాఖ సూచించింది. ఈ నెల 20న బుధవారం లాస్ట్ డేట్ కావడంతో ఈ అవకాశం రైతులు వినియోగించుకోవాలని ప్రభుత్వం కోరింది.

సంబంధిత దరఖాస్తును పూర్తి చేసి, ముఖ్యమైన డాక్యుమెంట్స్ ను సాఫ్ట్ వేర్ లో అప్డేట్ చేయాలి.రైతు పేరు, తండ్రి పేరు, ఇంటి పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబరు, గ్రామం, మండలం, జిల్లా, పట్టాదారు పాసు పుస్తకం నెంబర్ వంటి అన్ని వివరాలను తప్పనిసరి నమోదు చేయాల్సి ఉండటం వల్ల ఏ ఒక్క మిస్టేక్ ఉన్న సరిచేసుకోవచ్చు. రైతు కుటుంబంలో భూయజమానైన యువతి పెళ్లైన తర్వాత ఆధార్‌ కార్డులో ఇంటి పేరు మార్చుకున్నా కూడా అవి కరెక్ట్ చేసుకోవాలి..

Read more RELATED
Recommended to you

Latest news