కెసిఆర్ నాయకత్వాన్ని యావత్ భారత్ కోరుకుంటుంది: మంత్రి శ్రీనివాస్ గౌడ్

-

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ అవసరాల కోసమే బీజేపీ హిందుత్వాన్ని వాడుకుంటున్నారు అని విమర్శించారు. దేశ ప్రజలకు భరోసా ఇవ్వలేని కాంగ్రెస్ కు నాయకత్వం లేదన్నారు. బిజెపి, కాంగ్రెస్ పార్టీలు కుల, మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ కీలక పాత్ర పోషిస్తారని చెప్పారు. కెసిఆర్ నాయకత్వాన్ని యావత్ భారత్ కోరుకుంటోందని అన్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశవ్యాప్తంగా అమలు అవ్వాలని పేర్కొన్నారు. సహజ వనరుల తో తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అభివృద్ధి చేశారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news