విచిత్రం!సంక్రాంతి సినిమాలు ఒకే రన్ టైమ్ లో.!

-

సంక్రాంతి పండుగ తెలుగు ప్రాంతాలలో భారీ ఎత్తున జరిగే పెద్ద పండుగ. ఈ పండుగ సందర్భంగా  విడుదల అయిన సినిమాను మినిమం గ్యారెంటీ ఉంటుంది.అందుకే చాలా మంది షూటింగ్ త్వరగా పూర్తి చేసి సంక్రాంతి బరిలో వుండాలని కోరుకుంటారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య , విజయ్, అజిత్ అందరూ  సంక్రాంతి బరిలో ఉన్నారు.

కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య  సినిమాను  సంక్రాంతి  పండుగ సందర్భంగా 13 న రిలీజ్ చేస్తున్నారు. అలాగే  బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాలయ్య బాబు సినిమా వీర సింహ రెడ్డి సినిమా , ఒక రోజు ముందుగానే అంటే జనవరి 12వ తేదీ న విడుదల కాబోతుంది. ఇక దిల్ రాజు సినిమా వారసుడుగా సంక్రాంతి రిలీజ్ కు సిద్ధంగా వుంది. వీళ్ళు కూడా కూడా 12 తేదీన కర్చీఫ్ వేశారు.

ఇక ఇన్ని సినిమాలు ఉండగా మరో మూడు సినిమాలు కూడా లైన్ లో ఉన్నాయి. తమిళ్ హీరో వలిమై ని డబ్ చేస్తూ జనవరి 11న  తెగింపు అనే పేరు మీద రాబోతుంది.ఇక 14న చిన్న సినిమా విద్యావాసుల అహం డేట్ ఖరారు చేసింది. ఇక ఇప్పుడు ఆరో సినిమా కూడా లైన్ లోకి వచ్చింది. యంగ్ హీరో  సంతోష్ శోభన్ హీరోగా వస్తున్న  కళ్యాణం కమనీయంని జనవరి 14నే రిలీజ్ కాబోతుంది. వీటిలో వరిసు, తూనివు, బాలయ్య చిత్రాలు కూడా దాదాపు ఒకే రన్ టైం లో వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ చిత్రాలను అయితే ఓవర్సీస్ లో సినీ మార్క్ సినిమాస్ లో రిలీజ్ అవుతుండగా వారు అయితే ఈ మూడు సినిమాలు కూడా 2 గంటల 40 నిమిషాల రన్ టైమ్ తో దిగుతున్నాయి..

Read more RELATED
Recommended to you

Latest news