చంద్రబాబు మొహంలో పశ్చాత్తాపం లేదు – సజ్జల

-

చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చికి ఎనిమిది మంది బలయ్యారని మండిపడ్డారు ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఉద్దేశపూర్వకంగానే ఇరుకు రోడ్డులో సభ పెట్టారని ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు పుష్కరాలలో తొక్కిసలాటకు కారణమై భక్తులను బలి తీసుకున్నారని.. ఇప్పుడు కందుకూరులో 8 మంది మృతికి కారణమయ్యారని అన్నారు.

ముందుగా అనుమతి తీసుకున్న ప్రాంతం కంటే ముందుకెళ్లి సభ పెట్టడం వల్లే కందుకూరు టిడిపి సభలో తొక్కిసలాట జరిగిందని ఆరోపించారు సజ్జల. ఈ ఘటనకు చంద్రబాబు బాధ్యత వహించాలన్నారు. ఇంత జరిగినప్పటికీ చంద్రబాబు మొహంలో పశ్చాత్తాపం లేదన్నారు. ఈ దుర్ఘటనను కూడా చంద్రబాబు తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఏది జరిగినా సెన్సేషన్ చేసుకోవాలన్నదే చంద్రబాబు గారి ఆరాటం అని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news