‘అంబాజీ పేట మ్యారేజీ బ్యాండ్’తో వస్తున్న సుహాస్

-

కలర్ ఫోటో సినిమాతో… హీరో సుహాస్ ఓ రేంజ్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. సుభాష్ హీరోగా నటించిన కలర్ ఫోటో సినిమాను హృదయ కాలేయం సినిమా తో పేరు తెచ్చుకున్న సాయి రాజేష్ నీలం నిర్మించారు. కొత్త దర్శకుడు సందీప్ రాజకీయ చిత్రానికి దర్శకత్వం వహించాడు. అయితే వీరి కాంబినేషన్లో వచ్చిన కలర్ ఫోటో మంచి విజయాన్ని సాధించింది. దీంతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సుహాస్ కు మంచి ఆఫర్లు వస్తున్నాయి.

కలర్ ఫోటో సినిమా తర్వాత ఫ్యామిలీ డ్రామా చేసిన సుహాస్… తాజాగా మరో సినిమాను ప్రకటించారు. దసరా పండుగ నేపథ్యంలో ” అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు” ఇంట్రెస్టింగ్ టైటిల్ తో వచ్చాడు హీరో సుహాస్. ఈ మేరకు ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది చిత్ర బృందం.

ఈ సినిమా హీరోగా సుహాస్ చేస్తుండగా… దృశ్యంత్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఈ సినిమాకు వెంకటేష్ మహ మరియు ధీరజ్ మొగిలినేని నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాను మహాయాన మోషన్ పిక్చర్స్ మరియు స్వేచ్చ క్రియేషన్స్‌ తెరకెక్కిస్తోంది. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news