చంద్రబాబుకు ఆహారం పంపుతోంది ఆయన కుటుంబ సభ్యులే : మంత్రి అంబటి

-

టీడీపీ చీఫ్‌ చంద్రబాబు అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ టీడీపీ శ్రేణులు నిరసనలు తెలియజేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. అంతేకాకుండా.. చంద్రబాబు ఆరోగ్యంపై పలు రకాలు ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు, ఎల్లో మీడియా అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నాయి అని ఆరోపించారు. చంద్రబాబుకి ప్రాణాపాయం ఉందని.. ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని.. 5 కిలోల బరువు తగ్గారని కుటుంబ సభ్యులే నోటికొచ్చిన అబద్దాలు చెప్తున్నారని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు.

దురుద్దేశంతో క్రూరంగా చంద్రబాబు ఆహారంలో స్టెరాయిడ్స్ ఇస్తున్నారన్నారని ఆరోపిస్తున్నారని అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు. చంద్రబాబుకు ఆహారం పంపుతోంది ఆయన కుటుంబ సభ్యులే. దీనికి సీఎం జగన్ మోహన్ రెడ్డే బాధ్యత వహించాలని విషపూరిత ప్రచారం చేస్తున్నారు అని మండిపడ్డారు. చంద్రబాబుకు సానుభూతి వచ్చేలా.. ప్రభుత్వంపై అసత్యాలు ప్రచారాలు చేస్తున్నారు అని మండిపడ్డారు.

 

టీడీపీలో యనమల రామకృష్ణుడు చాలా సీనియర్‌ అని చంద్రబాబు 5 కిలోల బరువు తగ్గారని ఇంకా తగ్గితే ఆయన కిడ్నీలపై ప్రభావం చూపుతుందని యనమల ఎలా చెప్తారని మంత్రి అంబటి ప్రశ్నించారు. చంద్రబాబుకు అనుకూలంగా ఏ న్యాయస్థానంలోనూ రిలీఫ్‌ రాలేదు…స్కామ్‌ల డబ్బు కూడా వచ్చి టీడీపీ ఖాతాల్లో పడ్డాయి అని ఆధారాలు ఉన్నాయన్నారు. చంద్రబాబుకు బెయిల్ ఇస్తే.. తన పలుకుబడితో సాక్ష్యులను ప్రభావితం చేస్తారు అని చెప్పుకొచ్చారు. చంద్రబాబు సలహా మేరకు పీఏ శ్రీనివాస్ అమెరికా పారిపోయాడు. అందుకే చంద్రబాబుకు బెయిల్ ఇవ్వటానికి ఈరోజు వరకు కోర్టుల నుంచి సుముఖత వ్యక్తం కాలేదు అని మంత్రి అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version