చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఓ దొంగల ముఠా: సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

-

చంద్రబాబు, పవన్ కళ్యాన్ ఓ దొంగల ముఠా అని… హైదరాబాద్ లో మకాం వేసి ప్రభుత్వాన్ని బదానాం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని అంటూ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్లంతా మనుషుల రూపంలో ఉన్న దయ్యాలు అంటూ విమర్శించారు. గతంలో రాష్ట్రాన్ని దోచుకుని అప్పులు పాలు చేశారని ఆరోపించారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి, గతంలో ఉన్న ప్రభుత్వాన్ని తేడాను చూడాలని జగన్ ప్రజల్ని కోరారు. మంచి చేస్తున్న మన ప్రభుత్వంపై అబద్దాలతో నిందలు వేస్తున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లు అబద్దపు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. మన పేదల్ని, అక్కచెల్లల్ని, మన ప్రజల్ని ద్వేషించే వారిని మనుషులు అనాలా… మనుషుల రూపంలో ఉన్న దెయ్యాలు అన్నాలా అని వ్యాఖ్యానించారు. ఎల్లోమీడియాను రక్షపిశాచులుగా విమర్శించారు.

ప్రధానితో నేను సమావేశం అయితే… జీర్ణించుకోలేని ఎల్లోమీడియా, బాబు, దత్తపుత్రుడు…మోదీ గారు జగన్ కు క్లాస్ పీకుతున్నారని అబద్దపు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు కానీ దత్తపుత్రుదుగానీ మోదీ సోఫాకిందనో, నా సోఫా కిందనో ఉన్నారా…? అంటూ ప్రశ్నించారు. ఇంత అసూయ మంచిది కానది చంద్రబాబు, పవన్ కళ్యాన్ లకు హితవు పలికారు. ఈ రోజు నేను నీతిగా ఉన్న రాజకీయ నాయకుడితోనో, వ్యవస్థతోనే యుద్ధం చేయడం లేదని… మారీచులు, రాక్షసులతో యుద్ధం చేస్తున్నాని జగన్ అన్నారు. వీరందిని నమ్మనే కూడాదని ప్రజలను కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news