అమిత్ షా హైదరాబాద్ టూర్ షెడ్యూల్ ఖరారు

-

హైదరాబాద్ లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన ఖరారైంది. సెప్టెంబర్ 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో బిజెపి తలపెట్టిన తెలంగాణ విమోచన దినోత్సవానికి ముఖ్యఅతిథిగా అమిత్ షా హాజరవుతున్నారు. విమోచన దినోత్సవం రోజంతా హైదరాబాద్ లోనే ఉంటూ వివిధ కార్యక్రమాలలో అమిత్ షా పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో రేపు రాత్రి 10 గంటలకు ఆయన నగరానికి చేరుకుంటారు.

రేపు రాత్రి పోలీస్ అకాడమీలో బస చేస్తారు. ఈనెల 17న ఉదయం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగే సభకు హాజరవుతారు. ఉదయం 8:45 గంటల నుంచి 11:45 గంటల వరకు పరేడ్ గ్రౌండ్ లోనే ఉంటారు. విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగురవేస్తారు. సభానంతరం పరేడ్ గ్రౌండ్ నుండి టూరిజం ప్లాజాకు బయలుదేరుతారు. అక్కడ ముఖ్య నేతల సమావేశంలో పాల్గొంటారు.

అనంతరం మధ్యాహ్నం 2:30 గంటలకు సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్స్ కు చేరుకుంటారు. మోడీ పుట్టినరోజు సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వికలాంగులకు ఉపకరణాల పంపిణీ చేస్తారు. సాయంత్రం పోలీస్ అకాడమీకి చేరుకొని అక్కడి నుండి రాత్రి ఢిల్లీకి తిరిగి పయనమౌతారు.

Read more RELATED
Recommended to you

Latest news