తగ్గేదేలే.. ‘పుష్ప’కు జై కొట్టిన అమితాబ్ బచ్చన్.. శ్రీవల్లితో షూటింగ్

-

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ – ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కిన హ్యాట్రిక్ ఫిల్మ్ ‘పుష్ప’ క్రేజ్ తగ్గడం లేదు. తగ్గేదేలే అన్నట్లుగా ఈ చిత్ర మేనియా ఇంకా కొనసాగుతోంది. పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయిన ఈ ఫిల్మ్ కు చక్కటి రెస్పాన్స్ అందుతోంది. ముఖ్యంగా నార్త్ ఇండియా సెలబ్రిటీలు, సామాన్యులు ఈ పిక్చర్ చూసి ఫిదా అయిపోయారు. తాజాగా ఈ చిత్రం గురించి సోషల్ మీడియా వేదికగా బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ పోస్టు పెట్టారు.

సోషల్ మీడియాలో అమితాబ్ బచ్చన్ కు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన వ్యక్తిగత, వృత్తి జీవితానికి సంబంధించిన విశేషాలను బచ్చన్ ఇన్ స్టా గ్రామ్ వేదికగా పంచుకుంటుంటారు. తాజాగా ‘గుడ్ బై’ చిత్ర షూటింగ్ సందర్భంగా దిగిన ఫొటో ఒకదానిని షేర్ చేశాడు. దానికి ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ జోడించాడు. ‘పుష్ప’ అనే క్యా్ప్షన్ తో ఈ ఫొటో పోస్టు చేశాడు. ఇందులో నేషనల్ క్రష్మిక, క్యూట్ అండ్ బ్యూటిఫుల్ భామ రష్మిక మందన, నీనా గుప్త, పవలి గుప్త ఉన్నారు.

రష్మిక మందన.. ‘గుబ్ బై’ చిత్రంలో అమితాబ్ బచ్చన్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఇక అమితాబ్ చేసిన కామెంట్ కు నెటిజన్లు స్పందిస్తూనే ఉన్నారు. రష్మిక మందన ‘పుష్ప’ కాదని ‘శ్రీవల్లి’ అని పోస్టులు పెడుతున్నారు. శ్రీవల్లి ఇప్పుడు ఫుల్ బిజీ అని కొందరు కామెంట్స్ చేస్తు్న్నారు. ‘పుష్ప పార్ట్ వన్’ పూర్తి కాగా, ‘పార్ట్ టూ’ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీవల్లి పాత్రను రష్మిక మందన పోషించింది.

 

 

https://www.instagram.com/p/CbvlyPvv0gw/?utm_source=ig_web_copy_link

Read more RELATED
Recommended to you

Latest news