ఆనం రామనారాయణరెడ్డి నివాసంలో టీడీపీ నాయకుల భేటీ…

-

నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ప్రస్తుతం వైసీపీ నుండి వచ్చేసి టీడీపీలో జాయిన్ అయిన విషయం తెలిసిందే. అప్పటి నుండి జిల్లాలో టీడీపీని ఏ విధంగా గెలిపించాలన్న కసితోనే పనిచేస్తున్నారు. తాజాగా ఆనం నివాసంలో మాజీ మంత్రి అమర్నాధ్ రెడ్డి, జిల్లా పరిశీలకులు బీసీ జనార్దన్ రెడ్డి మరియు ఇతర జిల్లా టీడీపీ నాయకులతో భేటీ అయ్యారు. ఈ భేటీలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడానికి అనుకూలించే పరిస్థితులు ఏమిటన్నది చర్చించినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్ర గురించి మరియు దీని వలన ప్రజలలో వస్తున్న మార్పు గురించి కూడా కొంత సేపు మాట్లాడుకున్నారట.

కాగా ఆనం టీడీపీలో చేరడంతో ఆయనకు ఏ సీటును కేటాయిస్తారు అన్న విషయం ఇంకా ఒక కొలిక్కి రాలేదు.

Read more RELATED
Recommended to you

Latest news