ఆంధ్రప్రదేశ్ అంటేే “జే” గ్యాంగ్ అడ్డా కాదు – అచ్చెన్నాయుడు

-

వైసీపీ ప్రభుత్వం పై మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. విశాఖను దోపిడీకి రాజధానిగా మారుస్తున్నారని విమర్శించారు. శనివారం విజయవాడలో నిర్వహించిన నాగుల చవితి వేడుకలలో పాల్గొన్న అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. వైసిపి మంత్రులు విశాఖలో దోపిడీకి తెగబడుతున్నారని ఆరోపించారు. ఈ దోపిడీని అడ్డుకుంటున్నామని తమపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.

మూడు రాజధానుల పేరుతో సీఎం జగన్ నాటకాలు ఆడుతున్నారని అన్నారు. ప్రకృతి సంపద రుషికొండను కొల్లగొట్టి కట్టుకునే ప్యాలెస్ ద్వారా సీఎం జగన్ ఏం సాధిస్తారని ప్రశ్నించారు. ఏపీకి రాజధాని ఏదని ఎవరైనా అడిగితే చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితికి రాష్ట్రాన్ని తీసుకువచ్చారని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ అంటే జే గ్యాంగ్ అడ్డా కాదంటూ హెచ్చరించారు. వైసీపీ నేతల అక్రమాలు బయటపడతాయని టిడిపి నేతల పోరుబాటను అడ్డుకుంటున్నారని విమర్శించారు. సీఎం దినపత్రిక పాలేగాళ్లు రాష్ట్రాన్ని పాలిస్తున్నారని ఆరోపించారు. పులివెందులలో కూడా గెలవలేని జగన్ రెడ్డి ప్రజలకి 175 గెలుస్తామనే భ్రమ కల్పిస్తున్నారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news