షాకింగ్ : టీటీడీ ఉద్యోగుల్లో 743 మందికి కరోనా పాజిటివ్ !

-

డయల్ యువర్ ఈవో కార్యక్రమం తరువాత పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్న టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అనేక సంచలన విషయలు బయట పెట్టారు. ఇప్పటిదాకా టీటీడీ ఉద్యోగుల్లో 743 మందికి కరోనా సోకిందన్న ఆయన ఇప్పటిదాకా అందులో 400 మంది కోలుకున్నారని కోవిడ్ కేంద్రాల్లో ఇంకా 338 మంది చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. అలానే టీటీడీ ఉద్యోగులు ఐదుగురు కోవిడ్ తో మృతి చెందారని పేర్కొన్నారు. గత నెల హుండీ ఆదాయం 16 కోట్లు, ఈ నెల ఇప్పటి దాకా హుండీ ద్వారా 3 కోట్లు ఆదాయం వచ్చిందని అన్నారు.

టీటీడీ వార్షిక బడ్జెట్ 3200 కోట్లు అని ఆయన పేర్కొన్నారు. ఇందులో 1350 కోట్ల రూపాయలు జీతాలకు ఖర్చవుతోందని అన్నారు. ఖర్చులు ఎంత తగ్గించుకున్నా ఇప్పుడు నెలకు 150 నుంచి 200 కోట్ల రూపాయలు అవుతోందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు కార్పస్ ఫండ్ నుంచి నిధులు తీసుకోలేదన్న ఆయన భవిష్యత్తులో టీటీడీ బోర్డులో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఆగస్టు నెలాఖరులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే అన్ లాక్ నిబందనలను బట్టి శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగానే నిర్వహించాలా? భక్తుల మధ్య నిర్వహించాలా? అనే అంశం మీద టీటీడీ పాలకమండలిలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.

తిరుమల శ్రీవారి కల్యాణోత్సవాలను ఆపాలని అర్చకులు మాతో చర్చించ లేదన్న ఆయన అర్చకులు ఏ సలహా ఇచ్చినా మేము సీరియస్ గానే స్పందిస్తామని అన్నారు. ఇప్పటి వరకు పాజిటివ్ వచ్చిన అర్చకుల్లో ఎక్కువ మంది తిరిగి డ్యూటీలకు అటెండ్ అవుతున్నారని అన్నారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్న అర్చకులకు తిరుమలలో విధులు ఇవ్వవద్దని ప్రధానార్చకులకు చెప్పామని, అర్చకులను ఇబ్బందికి గురిచేసి దర్శనాలు చేయించాలనే ఆలోచన టీటీడీకి లేదని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news