ఏపీలో నేడు కొత్తగా 8 కరోనా కేసులు

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా కేసుల సంఖ్య నిల‌క‌డగా ఉంటుంది. గ‌త కొద్ది రోజుల నుంచి రాష్ట్రంలో క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. గ‌తంలో కేవలం ఒక్క కేసు మాత్ర‌మే న‌మోదు అయింది. కానీ క్ర‌మంగా పెరుగుతూ వ‌చ్చాయి. ఈ రోజు కరోనా వైర‌స్ బులిటెన్ ను ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడుద‌ల చేశారు. ఈ కరోనా బులిటెన్ ప్ర‌కారం.. ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 8 క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.

corona cases | కరోనా కేసులు

శుక్ర‌వారం కూడా ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో 8 క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. కాగ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ నుంచి 15 మంది బాధితులు పూర్తిగా కోలుకున్నారు. దీంతో ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం 56 క‌రోనా వైర‌స్ యాక్టివ్ కేసులు మాత్ర‌మే ఉన్నాయి. అలాగే ఈ రోజు ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా మ‌ర‌ణాలు న‌మోదు కాలేదు. కాగ గ‌డిచిన 24 గంట‌ల్లో ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు.. 3,556 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్షలు నిర్వ‌హించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version