అయ్యన్న పాత్రుడు, బుచ్చయ్య, పరిటాల కుటుంబాలకు షాక్ ?

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. చంద్రబాబుతో పాటు 24 మంది మంత్రులుగా కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో… జనసేన పార్టీకి మూడు మంత్రి పదవులు ఇచ్చిన చంద్రబాబు నాయుడు… బిజెపికి ఒకే ఒక్క మంత్రి పదవి ఇచ్చారు. అంతేకాకుండా 17 మంది కొత్త వారికి మంత్రి పదవులు ఈసారి రానున్నాయి. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పై తెలుగు తమ్ముళ్లు చాలా సీరియస్ అవుతున్నారు.

 

 

పార్టీ కోసం కష్టపడ్డ వారికి తప్ప… మిగతా వారికి మంత్రి పదవులు వచ్చాయని ఫైర్ అవుతున్నారు. అయ్యన్నపాత్రుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ధూళిపాళ్ల నరేంద్ర, పరిటాల సునీత, కూన రవికుమార్ లాంటి వారు పార్టీ కోసం గత ఐదు సంవత్సరాలుగా చాలా కష్టపడ్డారని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. కానీ అలాంటి వారికి చంద్రబాబు నాయుడు చాన్స్ ఇవ్వకుండా… వైసిపి నుంచి వచ్చిన పార్థసారథి లాంటి వారికి మంత్రి పదవి ఇచ్చి… మరోసారి చంద్రబాబు నాయుడు విఫలమయ్యారని అంటున్నారు. వెంటనే… పార్టీ కోసం కష్టపడ్డ వారికి తగిన పోస్ట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version