విద్యార్థులకు గుడ్‌న్యూస్..నేడే అమ్మ ఒడి డబ్బులు జమ..

-

రెండు రోజుల కిందట ఏపీ క్యాబినెట్ సమావేశం అయిన సంగతి తెలిసిందే. అయితే.. 42 అంశాలపై ఈ ఏపీ కేబినెట్‌ భేటీలో చర్చ జరిగింది. ఇక ఈ సందర్భం గా మూడో విడత జగనన్న అమ్మ ఒడి పథకం అమలుకు ఆమోదం తెలిపింది ఏపీ కేబినెట్‌.

దీంతో ఈ నెల 27వ తేదీన అంటే నేడు… అమ్మ ఒడి నిధులను విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం. అలాగే… జులైలో అమలు చేసే జగనన్న విద్యా కానుక, వాహన మిత్ర, కాపు నేస్తం పథకాలకు కూడా ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

ఇందులో భాగం గానే.. ఇవాళ శ్రీకాకుళం జిల్లా లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ పర్యటనలో అమ్మ ఒడి మూడో విడత కార్యక్రమంలో పాల్గొననున్నారు సిఎం జగన్. ఈ సందర్భంగా బటన్ నొక్కి రూ.6,594 కోట్లు తల్లుల బ్యాంక్ ఖాతాలలో జమచేయనుంది ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Latest news