వచ్చే నెలలో జగనన్న పశు ఆరోగ్య సురక్ష శిబిరాలు

-

ఏపీలోని పశువుల ఆరోగ్యం నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పశువుల ఆరోగ్య భద్రత కోసం జగనన్న పశు ఆరోగ్య సురక్ష శిబిరాలు నిర్వహించాలని ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Jagananna Pasu Arogya Suraksha Program

ప్రస్తుతం ప్రజల ఆరోగ్యం కోసం చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష తరహాలోనే దీనిని అమలు చేయనుంది. వచ్చేనెల 7న తిరుపతి జిల్లాలో, 10న ఎన్టీఆర్ జిల్లాలో, 14న విజయనగరం జిల్లాలో ప్రయోగాత్మకంగా శిబిరాలను ఏర్పాటు చేయనుండగా… డిసెంబర్ 1-31 వరకు రాష్ట్రమంతటా శిబిరాలు నిర్వహించనుంది.

ఇక అటు నేడు 3వ రోజు వైసీపీ బస్సు యాత్ర కొనసాగనుంది. సామాజిక సాధికార యాత్ర డే 3లో భాగంగా ఇవాళ ఉత్తరాంధ్ర విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గంలో వైసీపీ బస్సు యాత్ర కొనసాగనుంది. ఇందులో మంత్రులు బొత్స, సిదిరి అప్పలరాజు, కార్మూరి, మేరుగ, విడదల, రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, ఇతర నేతలు పాల్గొననున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12:30 కు బస్సు యాత్ర ప్రారంభంకానుంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version