ఏపీలో మ‌రో దారుణం..ఒంట‌రిగా ఉంటోన్న మ‌హిళ‌పై అత్యాచారం

-

ఏపీ లో రోజుకో దారుణ సంఘటన చోటు చేసుకుంటోంది. వరుసగా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఏపీలోని రేపల్లె రైల్వే స్టేషన్‌ లో మహిళపై సాముహిక లైంగిక దాడి జరిగిన సంఘటన ను మరువక ముందే.. ఏపీలో మరో విషాదం సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలతో ఒంటరిగా ఉంటోన్న మహిళపై కొంత మంది దుండగులు లైంగిక దాడికి పాల్పడ్డారు.

పార్వతీపురం మన్యం జిల్లా నుంచి ఉపాధి కోసం ఓ మహిళ విజయనగరం వచ్చి టీ దుకాణంలో పని చేస్తోంది. గత అర్థరాత్రి ఆమె ఇంటికి వెళ్లి.. తలుపుకొట్టిన కొందరు దుండగులు ఆమె ఇంట్లోకి చొరబడి లైంగిక దాడి చేశారు. ఈ రోజుల ఉదయం బాధిత మహిళ ఫిర్యాదు పోలీసులకు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఈ సంఘటన ఎలా జరిగిందనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news