వైసీపీ పాలనలో ఏపీ నేరాంధ్రప్రదేశ్ గా మారిపోయింది – చంద్రబాబు

-

వైసీపీ ప్రభుత్వ పరిపాలనపై ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు. నంద్యాలలో దళిత యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. వైసీపీ పాలనలో బడుగుల హత్యలు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. నంద్యాలలో యువకుని ఆత్మహత్య.. వ్యవస్థ చేసిన హత్యేనని విమర్శించారు. వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ నేరాంధ్రప్రదేశ్ గా మారిపోయిందని ట్వీట్ చేశారు.

వ్యవస్థలు చేస్తున్న హత్యలకు బడుగులు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దొంగతనం నేరం మోపి పోలీసులు వేదించడంతోనే నంద్యాలలో చిన్నబాబు అనే దళిత యువకుడు ప్రాణాలు తీసుకోవడం అత్యంత బాధాకరమని తెలిపారు. ఏ పోలీసులు అయితే వేధిస్తున్నారని 2020 నవంబర్ లో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిందో.. అదే పోలీస్ స్టేషన్ అధికారుల వేధింపుల కారణంగా నేడు చిన్న బాబు రైలు కింద పడి ప్రాణాలు తీసుకోవడం విషాదకరమని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news