ఇవాళ కర్నూలు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.. ఆ డబ్బులు విడుదల

-

కర్నూలు జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. కర్నూలు జిల్లాలో నేడు పత్తికొండ మండలం పుచ్చకాయలమాడకు సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఎన్టీఆర్‌ భరోసా ఫించన్‌ కార్యక్రమంలో పాల్గొననున్న చంద్రబాబు.. పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేయనున్నారు.

ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు షెడ్యూల్ ఫైనల్ ఐంది. కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుభవార్త చెప్పడం జరిగింది. వరద బాధితుల సహాయం పై కీలక ప్రకటన చేశారు చంద్రబాబు నాయుడు. అక్టోబర్ 4వ తేదీన అంటే మరో నాలుగు రోజుల్లోనే అందరి అకౌంట్లో డబ్బులు వేస్తామని వివరించారు.

తమ ఖాతాల్లో వరద సాయం డబ్బులు పడడం లేదంటూ చాలామంది ఆందోళన చేస్తున్నారు. ఈ తరుణంలోనే తాజాగా సమీక్ష సమావేశం నిర్వహించారు నారా చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. అక్టోబర్ 4వ తేదీలోపు అందరూ అకౌంట్లో డబ్బులు జమ చేస్తామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version