30 కోట్లు ఇస్తామన్నారు.. ఏపీ డిప్యూటీ సీఎం రాజన్న దొర సంచలన వ్యాఖ్యలు

-

శుక్రవారం విజయనగరంలో నిర్వహించిన జిల్లాస్థాయి వైసిపి ప్లీనరీ సమావేశాల్లో పాల్గొన్నారు ఏపీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొదటి విడతలో తనకు మంత్రి పదవి రాకపోయినా తానేమీ అసంతృప్తి చెందలేదని అన్నారు. తనకు కాకుండా పుష్పశ్రీవాణి కి అవకాశం దొరికినా ఒక్క మాట కూడా అనలేదు అన్నారు. పత్రికలు, టీవీ లో వస్తున్న వార్తల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, నిజానిజాలు నిర్ధారించుకోవాలి అని ప్రజలకు సూచించారు.

రాష్ట్రంలో టిడిపి అధికారంలో ఉన్నప్పుడు తనను ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం చేశారని రాజన్నదొర ఆరోపించారు. తాను వైసీపీని వీడి టీడీపీలో చేరితే రూ. 30 కోట్లు, మంత్రి పదవి, అమరావతిలో ఇల్లుతో పాటు తన పిల్లలకు చదువు బాధ్యతను కూడా చూసుకుంటామని హామీ ఇచ్చారని సంచలన ఆరోపణలు చేశారు. అయితే జగన్ పై నమ్మకం, అభిమానంతో తాను అందుకు అంగీకరించలేదు అన్నారు. అప్పుడు టిడిపిలోకి వెళ్లకపోవడం వల్లే నేడు మంచి పదవిలో ఉన్నానని చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news