గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే భర్తపై అట్రాసిటీ కేసు..!

-

తెలుగు దేశం పార్టీ కి చెందిన గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గళ్లా మాధవి భర్త రామచంద్ర రావు తాజాగా రెచ్చిపోయారు. ప్రధానంగా తన రియల్ ఎస్టేట్ కోసం భూమి అమ్మలేదన్న కారణంతో ఓ కుటుంబంపై దాడికి దిగారు. దీంతో వ్యవహారం ముదిరింది.  కోర్టు వరకు వెళ్ళింది. కోర్టు ఆదేశాలతో ఎమ్మెల్యే భర్తపై కేసు నమోదు చేశారు. గుంటూరు తెలుగుదేశం పార్టీలో ఈ వ్యవహారం ఇప్పుడు కలకలం రేపుతోంది.

పోలీసుల సమక్షంలోనే దాడి చేసినప్పటికీ  చర్యలు తీసుకోలేదని ఆరోపించారు బాధితులు. ప్రస్తుతం నిందితుడి మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయింది.  గుంటూరు పట్టాభిపురం పోలిసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తు పూర్తయితే కానీ అసలు ఏం జరిగిందనేది క్లారిటీ రాలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version