నేరుగా నువ్వే నర్సీపట్నం వచ్చేయ్ తేల్చుకుందాం : సాయిరెడ్డికి అయ్యన్న సవాల్

-

ఇటీవల నర్సీపట్నంలో మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇంటి ప్రహరీ గోడ కూల్చివేత వ్యవహారం తీవ్ర రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే.వైసీపీ నేతలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని టిడిపి నేతలు మండిపడుతున్నారు.ఈ వ్యవహారంపై అయ్యన్నపాత్రుడు తన ట్విట్టర్లో స్పందించారు.తనని ఎదుర్కోవడానికి రాష్ట్ర అధికార యంత్రాంగం అంతా నర్సీపట్నం లోనే ఉందని వెల్లడించారు.

జెసిబిలు, ఐపీఎస్ లు, ఆర్డివోలు వందల సంఖ్యలో పోలీసు సిబ్బంది, పదుల సంఖ్యలో పోలీసు వాహనాలు తీసుకువచ్చారని ఆరోపించారు.సోషల్ మీడియా పోస్టులపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.అంత భయం ఎందుకు సాయి రెడ్డి?దమ్ముంటే నేరుగా నువ్వే నర్సీపట్నం వచ్చేయ్ తేల్చుకుందాం!అంటూ అయ్యన్న వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కి సవాల్ విసిరారు.

Read more RELATED
Recommended to you

Latest news