ఏపీ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఈనెల 15 వరకు నో జీతాలు !

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ బాగా లేకపోవడంతో కొట్టుమిట్టాడుతోంది ఏపీ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఏపీ ఉద్యోగులకు కూడా షాక్ ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్ దారులకు చెల్లింపులు ఆలస్యం కానున్నాయి.

ఈ నెల 15 వరకు అందరికీ జీతాలు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రానికి వచ్చే రాబడి, అప్పులపై ఆంక్షలు ఉండడంతో ఈ పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం. రాబడి, చెల్లింపులకు భారీగా వ్యత్యాసం ఉండడంతో జీతాల చెల్లింపుల్లో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీనికి తోడు కేంద్రం నుండి రావాల్సిన జీఎస్టీ నిధులు వెనక్కి వెళ్ళాయి.

Read more RELATED
Recommended to you

Latest news