BREAKING : జమ్ముకశ్మీర్‌లో అనుమానాస్పద పేలుడు

-

జమ్మూకశ్మీరులో మంగళవారం రాత్రి పేలుడు సంభవించింది. జమ్ముకశ్మీర్‌లోని జమ్ములో ఈ పేలుడు కలకలం సృష్టించింది. మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత జమ్ము సమీపంలోని సిధ్రా వంతెన వద్ద అనుమానాస్పద పేలుడు సంభవించింది. దీంతో అక్కడ భారీగా మంటలు ఎగసిపడ్డాయి. సిధ్రా బ్రిడ్జి చెకింగ్‌ పాయింట్‌ వద్ద భారీ పేలుడు జరిగిందని పోలీసులు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు.

Blast in Afghanistan Big explosion in Balkh province of Afghanistan many  casualties feared

పేలుడు ఘటనకు కారణాలపై తాము సోదాలు జరుపుతున్నామని జమ్ము సీనియర్ ఎస్పీ చందన్ కోహ్లి తెలిపారు. ఈ పేలుడు ఘటనకు పాల్పడ్డ వారు ఎవరనేది ఇంకా తెలియరాలేదని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. పేలుడు ఘటనకు కారణాలపై తాము సోదాలు జరుపుతున్నామని జమ్మూ సీనియర్ ఎస్పీ చందన్ కోహ్లి చెప్పారు. పేలుడు ఘటన జమ్మూలో కలకలం రేపింది. ఈ పేలుడు ఘటనకు పాల్పడ్డ వారు ఎవరనేది పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news