హిందువులకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి – పురంధేశ్వరి

-

హిందువులకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు బీజేపీ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ పురంధేశ్వరి. ఇవాళ మీడియాతో బీజేపీ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ… 1975వ సంవత్సరంలో దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగ స్ఫూర్తి ని దెబ్బతిసి, వేలాది మంది సిక్కులని ఊచ కోత విధించిన వారు పార్లమెంట్ లో నీతులు పలకడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

BJP Andhra Pradesh State President, MP Purandheswari slams rahul gandhi

పార్లమెంట్ లో రాహుల్ గాంధీ హిందువుల మీద చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకువాలని డిమాండ్‌ చేశారు. హిందువులు అసత్యాలు పలుకుతారని, హింసలకి పాల్పడతారని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు కోట్లాది హిందువుల మనోభావాలు దెబ్బతిసారని తెలిపారు. రాహుల్ గాంధీ భారత దేశ హిందూ ప్రజల కి క్షమాపణ చెప్పాలని కోరారు బీజేపీ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ పురంధేశ్వరి.

Read more RELATED
Recommended to you

Exit mobile version