స్టీల్ ప్లాంట్ ధ్వంసం చేయాలనే ఆలోచన కేంద్రానికి లేదు : పురంధేశ్వరి

-

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ వ్యవహారం తిరిగి తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే స్టీల్ ప్లాంట్ ను మేము ప్రవేటీకరణకు గురి కానివ్వం అని వైసీపీ నేతలు కామెంట్స్ చేస్తున్న నేపథ్యంలో.. ఏపీ కూటమి ప్రభుత్వంలో భాగమైన బీజేపీ రాష్ట్రం అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ఈ వ్యవహారం పై స్పందించారు. తాజాగా ఆమె మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ ను ధ్వంసం చేయాలనే ఆలోచన కేంద్రానికి లేదు. స్టీల్ ప్లాంట్ ని కాపాడి, లాభాల్లోకి తీసుకురావాలనేదే కేంద్రం ఉద్దేశం అని పేర్కొన్నారు.

అలాగే కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ఈ విషయంపై సానుకూలంగా స్పందించారు. ఇవాళ ప్రధాని మోదీ జన్మదినం.. బీజేపీకి ప్రత్యేకమైన రోజు. మోడీ పుట్టినరోజు సందర్భంగా రాజమండ్రి క్వారీ అన్నా క్యాంటిన్ ఒకరోజు ఖర్చును బీజేపీ భరించింది. ప్రధాని మోడీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కానుంది. ఇక రాజమండ్రిలో గౌతమీ నేత్రాలయం, రోటరీ క్లబ్ చేస్తున్న సేవలు అభినందనీయం అని అన్నారు పురంధేశ్వరి.

Read more RELATED
Recommended to you

Exit mobile version