BREAKING : తారకరత్నపై విష ప్రయోగం ?

-

నేడు ఉదయం నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర ని ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ పాదయాత్రలో పాల్గొన్న నటుడు తారకరత్న స్పృహ తప్పి వాహనం పై నుండి కింద పడిపోయారు. దీంతో హుటాహుటిన తారకరత్నని కుప్పం కేసి ఆసుపత్రికి తరలించారు. అక్కడినుండి మెరుగైన వైద్య చికిత్స కోసం పిఇఎస్ ఆసుపత్రికి తరలించారు. అయితే తారకరత్న ఆసుపత్రికి వచ్చినప్పుడు పల్స్ లేదని వైద్యులు తెలిపారు. శరీరం నీలంగా మారిందని, వెంటనే చికిత్స ప్రారంభించామని వైద్యులు తెలిపారు.

 

తారకరత్న పల్స్ సాధారణ స్థితికి చేరుకునేందుకు 45 నిమిషాల సమయం పట్టిందని వైద్యులు తెలిపారు. అయితే మరోవైపు తారకరత్న పై విషప్రయోగం జరిగిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు టిడిపి నేతలు. కొలికెలపూడి గారి సంఘటన తెలిసిన తర్వాత అయినా బయట వారు ఇచ్చే ప్రసాదాలు, ఆహారంపై చాలా జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. తారకరత్న శరీరం నీలిరంగులోకి మారడంతో వారు ఈ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news