చంద్రబాబు ప్రజాధనాన్ని తనకు కావాల్సిన వాళ్ళకి కట్టబెట్టారు – సీఎం జగన్

-

చంద్రబాబు ప్రజాధనాన్ని తనకు కావలసిన వారికి కట్టబెట్టారని అసెంబ్లీలో ఆరోపించారు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. అమరావతిలో జరిగిన నిర్మాణాలలో భారీగా అవినీతి జరిగిందని ఆరోపించారు. ఈ అవినీతిని చంద్రబాబు పీఏ శ్రీనివాస్, మనోజ్ డీల్ చేశారని అన్నారు. ఆర్.వి.ఆర్ రఘు, కృష్ణ, నారాయణ సంస్థలకు ఈ నిధులను మళ్ళించారని.. చివరకు నిద్దులన్నీ మళ్లీ చంద్రబాబు జేబులోకే చేరాయని ఆరోపించారు.

అమరావతిలో జరిగిన నిర్మాణాలను షాపూర్ జి పల్లోంజి సంస్థ చేపట్టిందని.. ఆ సంస్థ ప్రతినిధి వాసుదేవ్ మనోజ్, చంద్రబాబు పీఏ శ్రీనివాస్ మధ్య డీల్ జరిగిందని ఆయన ఆరోపించారు. ఈ సంస్థ పై 2019లో ఐటీ రైడ్స్ జరిగాయని గుర్తు చేశారు. ఫైనల్ గా ఐటీ శాఖ చంద్రబాబుకు కూడా నోటీసులు పంపించిందని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news